Chittoor District: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..

|

Dec 05, 2021 | 6:19 PM

చిత్తూరు జిల్లారో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం అగరాల వద్ద డివైడర్ ను ఢీకొన్న కారు బోల్తా పడింది.

Chittoor District: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..
Road Road Accident
Follow us on

చిత్తూరు జిల్లారో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట హైవేపై అగరాల వద్ద డివైడర్ ను ఢీకొన్న కారు బోల్తా కొట్టింది. ఈ సమయంలో కారు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అందులో ప్రయాణిస్తోన్న ఐదుగురు స్పాట్‌లో మృతి చెందగా.. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉంది. మొత్తం కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిప్రమాదశాఖ అధికారులు.. మంటలను అదుపు చేశారు.  ప్రమాదానికి గురైన కారు నంబర్ AP39HA4003గా గుర్తించారు. ఘటనలో కారు పూర్తిగా దగ్డమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… డెడ్‌బాడీలను మార్చురీకి తరలించారు. మృతులంతా శ్రీకాకుళంజిల్లా సంతకవిటి మండలం మేడమర్తి గ్రామంకి చెందిన వాళ్ళుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.

మృతులు

1. కంచరాపు శ్రీరాములు.
2. కంచరాపు సురేష్ కుమార్.
3, కంచరాపు మీన.
4. కంచరాపు జోస్విక్ (3నెలలు పాప)
5. పైడి గోవింద.
6. పైడి సత్యవతి.

Also Read: చెత్త ఏరుకునే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న వివాహిత.. మర్డర్ కేసు విచారణలో నమ్మలేని విషయాలు

 అనసూయ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతున్న స్టార్ యాంకర్