Paramount Agro Fire accident: విశాఖపట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి అగనంపూడి ఇండస్ట్రియల్ ఏరియాలోని పారామౌంట్ ఆగ్రో ఇండస్ట్రీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. అయితే అగ్ని ప్రమాదం ప్రమాదశాత్తు సంభవించిందా.. లేక ఏదైనా షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిందా..? అనేదానిపై పరిశీలిస్తున్నారు.
కాగా, ఘటన సమయంలో పరిశ్రమలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే భారీ ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అధికారులు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ కంపెనీలో డబ్బాలు, ప్యాకెట్లలోకి నూనెను నింపుతారు. ప్రమాద స్థలంలో దువ్వాడ సీఐ పి. లక్ష్మీ తన సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్నారు. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో అటు వైపు పోలీసులు ఎవ్వరిని రానీయడం లేదు.
Also Read:
Hanmakonda Man Arrested: ఢిల్లీ మైనర్ బాలికను హన్మకొండకు రప్పించి అత్యాచారం.. మధురైలో అరెస్టు..!