AP Governor: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలింపు

|

Nov 17, 2021 | 11:39 AM

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. అత్యవసర చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు.

AP Governor: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలింపు
Biswabhusan Harichandan
Follow us on

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయన్ను ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఊపిరితిత్తులలో సమస్య తలెత్తడంతో గవర్నర్ బిశ్వభూషణ్‌ తీవ్ర అనారోగ్యం పాలయినట్టు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో బిశ్వభూషణ్‌కు చికిత్స అందిస్తున్నారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. బిశ్వభూషణ్‌కు భార్య సుప్రవ హరిచందన్, కుమారుడు పృథ్వీరాజ్ హరిచందన్ ఉన్నారు. ఈ తెల్లవారుజామున అస్వస్థతకు గురవ్వడంతో.. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది. బిశ్వభూషణ్ హరిచందన్  2019 జూలై 24న ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Also Read: Viral Video: అందరూ నిద్రిస్తుండగా ఇంట్లోకి అనుకోని అతిథి

‘జవాద్‌’ ఎఫెక్ట్‌.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక