Garuda Scheme: సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. వారి అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సహాయం..

| Edited By: Ravi Kiran

Oct 22, 2021 | 7:27 PM

CM YS Jagan - Garuda Scheme: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం

Garuda Scheme: సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. వారి అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సహాయం..
Ys Jagan
Follow us on

CM YS Jagan – Garuda Scheme: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. తాజాగా బ్రాహ్మణులకు చేయుతనిచ్చేందుకు శ్రీకారం చుట్టింది. తాజాగా పేద బ్రహ్మణులకు ఆర్థిక సహాయం చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో నిరుపేద బ్రహ్మణుల అంత్యక్రియలకు ప్రభుత్వం గరుడ సహాయ పథకం కింద రూ.10 వేల ఆర్థిక సహాయం ఇవ్వనుందని అధికారులు వెల్లడించారు. ఈ పథకానికి రూ.75 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరణించిన 40 రోజులలోపు ఆయా కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పథకం కోసం http://andhrabrahmin.ap.gov.in/ వెబ్‌ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఈ నగదు వ్యవహారాలను చూసుకోనుంది.

గరుడ పథకానికి వీరే అర్హులు..
అంత్యక్రియల ఖర్చుల పథకానికి దరఖాస్తు చేయాలంటే కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి.
మరణించిన వారి డేత్ సర్టిఫికెట్ ఉండాలి.
కుటుంబ ఆదాయం రూ.75,000/- కంటే ఎక్కువ ఉండకూడదు
మరణించిన వారి గుర్తింపు కార్డులు, దరఖాస్తు చేసే కుటుంబ సభ్యులు గుర్తింపు కార్డులు ఉండాలి.
ఈ దరఖాస్తును పూర్తిగా ఆన్‌లైన్‌లో (www.andhrabrahmin.ap.gov.in) చేయాల్సి ఉంటుంది.

Also Read:

TTD Darshan: వెంకన్న దర్శన టికెట్లు దొరకలేదని దిగులు చెందుతున్నారా.? ఆర్టీసీ చెప్పిన ఈ శుభవార్త మీ కోసమే..

AP LAWCET Results: విడుదలైన ఏపీ లా సెట్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌ వివరాలు..