Nadendla Manohar : బాధ్యతలు చేపట్టక ముందే రంగంలోకి దిగిన మంత్రి.. దెబ్బకు అధికారుల ఉరుకులు, పరుగులు

| Edited By: Balaraju Goud

Jun 15, 2024 | 9:22 PM

కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండే మంత్రి నాదెండ్ల మనోహర్ తనదైన ముద్ర వేస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తెనాలి అభివృద్దిపై దృష్టి సారించారు. పట్టణంలోని కాలువల్లో పూడికతీత పనులు వెంటనే చేపట్టాలంటూ అధికారులకు హూకుం జారీ చేశారు

Nadendla Manohar :  బాధ్యతలు చేపట్టక ముందే రంగంలోకి దిగిన మంత్రి.. దెబ్బకు అధికారుల ఉరుకులు, పరుగులు
Nadendla Manohar
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండే మంత్రి నాదెండ్ల మనోహర్ తనదైన ముద్ర వేస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తెనాలి అభివృద్దిపై దృష్టి సారించారు. పట్టణంలోని కాలువల్లో పూడికతీత పనులు వెంటనే చేపట్టాలంటూ అధికారులకు హూకుం జారీ చేశారు. ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. దాదాపు 47 కిలోమీటర్ల మేర ఎనిమిది ప్రధాన కాలువలను శుభ్రం చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు స్థానికులు కూడా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కాలువలను ఆక్రమించిన వారంతా కూడా తమ ఆరోగ్యం బాగుండాలంటే కాలువల శుభ్రం చేయడానికి సహకరించాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన ఎన్డీయే సర్కార్‌లో నాదెండ్లకు సివిల్ సప్లైస్ ఫోర్ట్ ఫోలియోను కేటాయించారు. ఇంకా మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించక ముందే నాదెండ్ల పనిలోకి దిగిపోయారు. తెనాలి నియోజకవర్గంలోని పౌర సరఫరాల గిడ్డంగులను అధికారులతో కలిసి పరిశీలించారు. గిడ్డంగుల్లో ఎంత స్టాక్ ఉందో రికార్డుల్లో చెక్ చేశారు. వచ్చే నెల కోటాకు సంబంధించి ఎంత బియ్యం పంపిణి చేయాలో అడిగి తెలుసుకున్నారు. మంత్రి నేరుగా రంగంలోకి దిగడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. మనోమర్ అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇచ్చారు. పౌర సరఫరాల శాఖను అత్యుత్తమంగా తీర్చిదిద్ది ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే సరుకులు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నాదెండ్ల…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…