Andhra Pradesh: ‘ బైజూస్ అంటే హెరిటేజ్ లో అమ్మే జ్యూస్ కాదు’.. చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్‌..

|

Jun 18, 2022 | 4:15 PM

Andhra Pradesh: ఏపీ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం ప్రముఖ ఎడ్యుకేషన్‌ టెక్‌ కంపెనీ బైజూస్‌తో..

Andhra Pradesh:  బైజూస్ అంటే హెరిటేజ్ లో అమ్మే జ్యూస్ కాదు.. చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్‌..
Botsa Satyanarayana
Follow us on

Andhra Pradesh: ఏపీ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం ప్రముఖ ఎడ్యుకేషన్‌ టెక్‌ కంపెనీ బైజూస్‌తో శుక్రవారం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బైజూస్‌ రూపొందించిన కంటెంట్‌ యాక్సెస్ చేసిన ట్యాబ్‌లను ప్రతి ఏడాది 8 వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. ఈ విధంగా ప్రతి ఏడాది 8వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై విపక్షలు విమర్మనాస్త్రాలు సంధించడం మొదలు పెట్టాయి. బైజూస్‌తో ఒప్పందం సరైన నిర్ణయం కాదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. దీంతో ఈ విమర్శలపై తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్‌ అయ్యారు. ‘బైజూస్‌ అంటే హెరిటేజ్‌లో అమ్మే జ్యూస్‌ కాదంటూ’ ఓ రేంజ్‌లో అటాక్ చేశారు మంత్రి.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘చంద్రబాబువి అన్నీ పనికి మాలిన మాటలు. బైజూస్ తో ఒప్పందం తప్పని ప్రపంచంలో ఏ ఒక్కరితో అయినా చెప్పిస్తావా.? 35లక్షల మంది పేద విద్యార్థులకు ఉచితంగా బైజూస్ తో అవగాహన కల్పిస్తుంటే విమర్శలు చేస్తారా.? మమ్మీ, డాడీ అనటం కోసమే లోకేష్‌ను ఇంగ్లీషు మీడియంలో చదివించావా? మీ కొడుకు, మనవడే ఇంగ్లీషు మీడియం చదువులు చదవాలా?’ అంటూ మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, ప్రభుత్వంపై విమర్శలు చేయడం సహజం. అయితే రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని చెప్పే చంద్రబాబు, నిన్న నా నియోజకవర్గంలో చేసిన విమర్శలు, ఆయన వాడిన భాష దారుణం. ఆయన మాటలు వింటే చంద్రబాబు పూర్తిగా సహనం కోల్పోయినట్లు, ఇక ఆయన పని అయిపోయినట్లు అనిపిస్తోంది’ అంటూ విరుచుకుపడ్డారు.

నీ మనవడిని అడుగు చెబుతాడు..

ఇవి కూడా చదవండి

‘బైజూస్‌ అనేది 150 మిలియన్ల విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్న కంటెంట్‌ సంస్థ. మీకు దాని గురించి తెలియకపోతే, నీ మనవడిని అడుగు చెబుతాడు. నిరుపేదల పిల్లలు, గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లిష్‌ చదువులు అందకపోవడమే మీ లక్ష్యం. బైజూస్‌ ద్వారా విద్యార్థులు బాగా చదువుకునేలా మంచి కంటెంట్‌ అందిస్తుంటే, దాన్ని కూడా ఎగతాళి చేస్తావా? విజయనగరం జిల్లా పర్యటనలో గత 48 గంటల్లో మాట్లాడిన దాంట్లో రాష్ట్రం కోసం, ఆ ప్రాంతం కోసం మాట్లాడిన విషయం ఒక్కటైనా ఉందా..?. వయస్సు, అనుభవం ఉంటేనే సరిపోదు. అవి ఇతరులతో షేర్‌ చేసుకునేలా ఉండాలి. అవి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి’ అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు బొత్స.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..