అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం..

| Edited By:

Aug 25, 2019 | 7:56 AM

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి.. మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నగరంలో ఫుట్‌బాల్ ఈవెంట్ జరుగుతుండగా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ ఎనిమిదేళ్ల అమ్మాయి మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, నాలుగు నెలల నుంచి జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు 12 మంది మృతిచెందారు.

అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం..
Follow us on

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి.. మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నగరంలో ఫుట్‌బాల్ ఈవెంట్ జరుగుతుండగా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ ఎనిమిదేళ్ల అమ్మాయి మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, నాలుగు నెలల నుంచి జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు 12 మంది మృతిచెందారు.