Mystery Illness: వికారాబాద్ జిల్లాలో కలకలం.. 45 మందికి అస్వస్థత.. వింత వ్యాధి అంటూ స్థానికుల ఆందోళన
వికారాబాద్ జిల్లాలో కలకలం చెలరేగింది. 45 మంది ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని వికారాబాద్ మండలం ఎర్రవల్లి, నవాబుపేట్ మండలం చిట్టిగిద్దలో పలువురు కళ్లుతిరిగి పడిపోయారు.
Mystery Illness: వికారాబాద్ జిల్లాలో కలకలం చెలరేగింది. 45 మంది ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని వికారాబాద్ మండలం ఎర్రవల్లి, నవాబుపేట్ మండలం చిట్టిగిద్దలో పలువురు కళ్లుతిరిగి పడిపోయారు. అంతుచిక్కని వ్యాధే కారణమని అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్కు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆనంద్వికారాబాద్ డీఎంహెచ్వోతో మాట్లాడారు. ర్రవల్లి, చిట్టిగిద్దలో తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మేల్యే సంబంధిత అధికారులకు సూచించారు. కాగా అస్వస్థతకు గల కారణాలపై వైద్యుల నుంచి ఇంకా ఎటువంటి నివేదిక అందలేదు.
Also Read :
Today Gold and Silver Price: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..తాజా రేట్లు ఇలా ఉన్నాయి
India Corona Cases: దేశంలో కొత్తగా 18,222 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా