సుడిగాలి బీభత్సం, ఆరుగురు మృతి

| Edited By: Anil kumar poka

Jul 05, 2019 | 7:38 AM

చైనాలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా చెలరేగిన టోర్నడో (సుడిగాలి) గింగిరాలు తిరుగుతూ దాదాపు గంటసేపు స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దీని ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆకాశంలో నల్లటి మబ్బులతో కూడిన టోర్నడో జనాన్ని భయపెట్టింది. ఇంటిపై కప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్థంభాలు, సెల్ టవర్స్, హోర్డింగ్స్ కుప్పకూలాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. టోర్నడో విధ్వంసంతో ప్రజలు భయబ్రాంతులకు […]

సుడిగాలి బీభత్సం, ఆరుగురు మృతి
Follow us on

చైనాలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా చెలరేగిన టోర్నడో (సుడిగాలి) గింగిరాలు తిరుగుతూ దాదాపు గంటసేపు స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దీని ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

ఆకాశంలో నల్లటి మబ్బులతో కూడిన టోర్నడో జనాన్ని భయపెట్టింది. ఇంటిపై కప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్థంభాలు, సెల్ టవర్స్, హోర్డింగ్స్ కుప్పకూలాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. టోర్నడో విధ్వంసంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇంట్లో నుంచి బయటకొచ్చేందుకు వణికిపోయారు. క్షణాల్లో చెలరేగిన సుడిగాలి ధాటికి భారీ విధ్వంసం జరిగింది.