కొండచరియలు విరిగి పడి 50 మంది మృతి, 80 మంది గల్లంతు

| Edited By:

Aug 11, 2019 | 1:26 PM

మయన్మార్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. శనివారం పడిన భారీ వర్షాలకు మోన్ రాష్ట్రంలోని యే ప్యార్ కోన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 50 మంది మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. సుమారు 16 ఇళ్లు నేలమట్టమై.. బురదలో కూరుకుపోయాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 80 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

కొండచరియలు విరిగి పడి 50 మంది మృతి, 80 మంది గల్లంతు
Follow us on

మయన్మార్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. శనివారం పడిన భారీ వర్షాలకు మోన్ రాష్ట్రంలోని యే ప్యార్ కోన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 50 మంది మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. సుమారు 16 ఇళ్లు నేలమట్టమై.. బురదలో కూరుకుపోయాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 80 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.