Breaking:ప్రారంభమైన రంజాన్ మాసం.. లాక్‌డౌన్‌ పొడిగింపు..!

| Edited By:

Apr 25, 2020 | 10:57 AM

ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. అయితే ప్రతి ఏడాదిలా ఇప్పుడు పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలని అనేక దేశాల ప్రభుత్వాలు, ముస్లిం పెద్దలు సూచించారు. ఇదిలా ఉంటే రంజాన్ వేళ.. పాకిస్థాన్‌లో లాక్‌డౌన్‌ను మే 9వ తేదీ వరకు పొడిగించారు. రంజాన్ నెల మధ్య వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని నిర్ణయించినట్లు ప్రణాళిక, అభివృద్ధి శాఖ మంత్రి అసద్‌ తెలిపారు. వైరస్ పోరాటంలో కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో […]

Breaking:ప్రారంభమైన రంజాన్ మాసం.. లాక్‌డౌన్‌ పొడిగింపు..!
Follow us on

ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. అయితే ప్రతి ఏడాదిలా ఇప్పుడు పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలని అనేక దేశాల ప్రభుత్వాలు, ముస్లిం పెద్దలు సూచించారు. ఇదిలా ఉంటే రంజాన్ వేళ.. పాకిస్థాన్‌లో లాక్‌డౌన్‌ను మే 9వ తేదీ వరకు పొడిగించారు. రంజాన్ నెల మధ్య వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని నిర్ణయించినట్లు ప్రణాళిక, అభివృద్ధి శాఖ మంత్రి అసద్‌ తెలిపారు. వైరస్ పోరాటంలో కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కాగా ప్రస్తుతం పాకిస్థాన్‌లో 11,700 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 248 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ముస్లిం ప్రజలకు రంజాన్‌ శుభాకాంక్షలు చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ పవిత్ర మాసంలో పేదలకు, అణగారిన వర్గాలకు ఏమీ చేయలేకపోతున్న కారణంగా.. అల్లాను క్షమాభిక్ష కోరుతున్నానని ఆయన అన్నారు.

Read This Story Also: ‘భారతీయుడు 2’.. దర్శకుడు, నిర్మాత మధ్య గొడవ.. ఆ హీరో విషయంలోనేనా..!