తొమ్మిదేళ్లకే ఏకంగా మిలియన్ డాలర్ల జాక్పాట్ గెలుచుకుని కోటీశ్వరురాలై పోయింది. దుబాయ్లో ఉంటున్న ఈ బాలిక అదృష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మూడేళ్ల వయస్సులోనే(2013) లగ్జరీ కారు గెలుచుకున్న ఈ లక్కీ గర్ల్ ఆరేళ్ల తర్వాత మరోసారి అదృష్టం వరించి మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ.7కోట్లు) గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
దుబాయిలో ఏటా ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీస్ మిలీనియమ్ మిలియనీర్’ పేరుతో లాటరీ నిర్వహిస్తుంటారు. దీని ప్రైజ్మనీ మిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఈ జాక్పాట్ను ఎమ్.ఎలీజా అనే భారత సంతతికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక గెలుచుకుంది. తన పేరిట ఆమె తండ్రి కొన్న 0333 నంబర్ గల టిక్కెట్కు లాటరీ తగిలినట్లు ఖలీజ్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
ఈ బాలిక తండ్రి స్వస్థలం ముంబయి. 19ఏళ్లుగా దుబాయ్లో ఉంటున్నాడు. 2004 నుంచి అతడు ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీస్ మిలీనియమ్ మిలియనీర్’ లాటరీలో పాల్గొంటున్నాడు. అతడి లక్కీ నంబర్ 9 కావడంతో ఈ ఏడాది 0333 నంబరు టిక్కెట్ను తన తొమ్మిదేళ్ల కూతురు ఎలీజా పేరుమీద కొనుగోలు చేశాడు. అతడి పంట పండి ఆ నంబర్కే ఫ్రైజ్మనీ రావడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.