Coronavirus: హడలెత్తిస్తున్న కరోనా.. తెలంగాణలో పెరిగిన అనుమానితులు!

| Edited By:

Feb 17, 2020 | 7:57 AM

Coronavirus: కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. దీని పేరు చెప్తేనే చాలు.. అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ప్రస్తుతం అరవై వేల మంది వరకు ఈ వైరస్ బారిన పడ్డట్టు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే ఈ కరోనా బారిన పడి.. 254 మంది మరణించారు. ఒకేరోజులో ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో మృతుల సంఖ్య పదమూడు వందలకు పైగా చేరింది. వైరస్ సోకిన వారి […]

Coronavirus: హడలెత్తిస్తున్న కరోనా.. తెలంగాణలో పెరిగిన అనుమానితులు!
Follow us on

Coronavirus: కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. దీని పేరు చెప్తేనే చాలు.. అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ప్రస్తుతం అరవై వేల మంది వరకు ఈ వైరస్ బారిన పడ్డట్టు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే ఈ కరోనా బారిన పడి.. 254 మంది మరణించారు. ఒకేరోజులో ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో మృతుల సంఖ్య పదమూడు వందలకు పైగా చేరింది. వైరస్ సోకిన వారి సంఖ్య 59,804గా చైనా మీడియ వెల్లడించింది.

కరోనా కేసులు ఇప్పటికే 25 దేశాలకు విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా 46, 997 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య 197కు చేరుకుంది. ఒక్క రోజే గాంధీ ఆస్పత్రిలో 10 అనుమానిత కేసులు నమోదయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇప్పటి వరకూ 8735 మందికి ధర్మల్ స్క్రీనింగ్స్ నిర్వహించారు. గాంధీ, ఫీవర్, ఉస్మానియా హాస్పటల్స్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా కేసులపై ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తోంది.