చైనా కెమికల్ ప్లాంటులో భారీ పేలుడు.. 44 మంది మృతి

| Edited By:

Mar 22, 2019 | 10:09 AM

బీజింగ్‌ : చైనాలోని ఓ కెమికల్ ప్లాంటులో భారీ పేలుడు సంభవించింది. చైనాలోని ఓ పారిశ్రామిక వాడలో సంభవించిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 44కు చేరింది. మరో 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. యాన్‌చెంగ్‌ పట్టణంలోని తియాన్‌జియాయీ రసాయన పరిశ్రమలో గురువారం ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్ర స్థాయిలో ఉండడంతో పరిసర ప్రాంతాలకు దట్టమైన మంటలు, పొగలు వ్యాపించడంతో భవనాలు […]

చైనా కెమికల్ ప్లాంటులో భారీ పేలుడు.. 44 మంది మృతి
Follow us on

బీజింగ్‌ : చైనాలోని ఓ కెమికల్ ప్లాంటులో భారీ పేలుడు సంభవించింది. చైనాలోని ఓ పారిశ్రామిక వాడలో సంభవించిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 44కు చేరింది. మరో 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. యాన్‌చెంగ్‌ పట్టణంలోని తియాన్‌జియాయీ రసాయన పరిశ్రమలో గురువారం ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్ర స్థాయిలో ఉండడంతో పరిసర ప్రాంతాలకు దట్టమైన మంటలు, పొగలు వ్యాపించడంతో భవనాలు దెబ్బతిన్నాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మంటలు అదుపురాకపోవడంతో ఇంకా విష వాయువులు లీకయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరిన్ని పేలుళ్లు సంభవించవచ్చని భావిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని దాదాపు 1000 నివాస గృహాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించడానికి దాదాపు 3500 మంది ప్రత్యేక వైద్య సిబ్బందిని రంగంలోకి దింపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పేలుడు ధాటికి పరిశ్రమలోని కిటికీ అద్దాలు దాదాపు 6కి.మీ దూరంలో పడ్డట్లు అక్కడి మీడియా పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు.