యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి యునైటెడ్ కింగ్డం (యూకే) వ్యవహారానికి మళ్లీ బ్రేకులు పడ్డాయి. వేరుపడే ప్రక్రియను ఆలస్యం చేయాలంటూ బ్రిటన్ పార్లమెంటు తీర్మానించింది. ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతిపాదించిన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని తక్షణం అంగీకరించేందుకు కామన్స్ సభ రిజెక్ట్ చేసింది. ఈ నెల చివరిలోగా ఈ వ్యవహారం తేలాల్సి ఉన్నప్పటికీ ఈ ఒప్పందాన్ని, దాని పర్యవసానాలను అధ్యయనం చేయడానికి.. తమకు మరో 3 నెలల గడువు కావాలని ఎంపీలు తేల్చిచెప్పారు. వెంటనే ఆమోదించాలన్న బోరిస్ జోన్సన్ ప్రతిపాదనను కామన్స్ సభ 322-306 ఓట్ల తేడాతో ఓడించింది. ఇది బోరిస్ జాన్సన్కు సభలో ఎదురైన తొలి ఎదురుదెబ్బ. కాగా, జాన్సన్ మాత్రం ఈ విషయంపై మరోసారి ఎంపీల అభిప్రాయాన్ని కోరుతానని, డెడ్లైన్లోగా ఒప్పందాన్ని ఆమోదించేట్లు చేస్తానని స్పష్టం చేశారు.