ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు పేలుళ్లు.. ముగ్గురు మృతి

| Edited By:

Mar 07, 2019 | 7:38 PM

కాబుల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ బాంబుల మోతతో దద్ధరిల్లింది. హెజ్బె వాదాత్ పార్టీ బహిరంగ సభ టార్గెట్‌గా ఉగ్రవాదులు మోర్టార్లతో విరుచుకుపడ్డారు. గ్రెనేడ్ లాంఛర్‌లతో బాంబులు విసిరారు. ఈ ఉగ్రదాడి ఘటనలో ముగ్గురు చనిపోగా, 19 మందికి గాయాలయ్యాయి. హెజ్బె వాదాత్ పార్టీ నేత అబ్దుల్ అలీ మజారీ 24వ వర్ధంతి సభ సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఘటన అనంతర భద్రతాదళాలు సహాయక చర్యలు చేపట్టాయి. సభా ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకొని భద్రతను కట్టుదిట్టం […]

ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు పేలుళ్లు.. ముగ్గురు మృతి
Follow us on

కాబుల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ బాంబుల మోతతో దద్ధరిల్లింది. హెజ్బె వాదాత్ పార్టీ బహిరంగ సభ టార్గెట్‌గా ఉగ్రవాదులు మోర్టార్లతో విరుచుకుపడ్డారు. గ్రెనేడ్ లాంఛర్‌లతో బాంబులు విసిరారు. ఈ ఉగ్రదాడి ఘటనలో ముగ్గురు చనిపోగా, 19 మందికి గాయాలయ్యాయి. హెజ్బె వాదాత్ పార్టీ నేత అబ్దుల్ అలీ మజారీ 24వ వర్ధంతి సభ సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఘటన అనంతర భద్రతాదళాలు సహాయక చర్యలు చేపట్టాయి. సభా ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకొని భద్రతను కట్టుదిట్టం చేశాయి.