నోయిడాలోని నాలుగో తరగతి చదువుతున్న బాలుడు సుమేర్.. ఓ గుడ్డముక్కతో ఉరి వేసుకున్న సంఘటన ఆ ప్రాంత వాసులను తీవ్రంగా కలిచివేస్తోంది. సెక్టార్ 20 పీఎస్ పరిధిలోని నిథారి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఈ-రిక్షా డ్రైవర్ అయిన తండ్రి శివేన్ దాస్తో కలిసి షికారుకు వెళ్లాలని సుమేర్ కోరగా.. వర్షం పడుతోందని ఇంట్లో.. టీవీ చూస్తూ ఉండమని చెప్పి శివేన్ బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. చుట్టుపక్కల ఇళ్లల్లో పనిచేసే తల్లి రేఖ కూడా ఇంట్లో లేని సమయంలో సుమేర్ ఒక్కడే ఉన్నాడు. కొద్దిసేపటికి తల్లితండ్రులు వచ్చి చూడగా సుమేర్ ఆత్మహత్య చేసుకున్న దృశ్యం చూసి కన్నీరుమున్నీరయ్యారు.
ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బహుశా టీవీ షోల ప్రభావంతోనే సుమేర్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.