Viral News: ప్రియుడు మోసం చేశాడని మహిళ దారుణ నిర్ణయం.. కోపంలో చేశానంటూ సమర్థింపు..

| Edited By: Ravi Kiran

Aug 06, 2022 | 4:06 PM

Viral News: సమాజంలో రోజురోజుకీ నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. చిన్నచిన్న సమస్యలకే విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమ పేరుతో జరుగుతోన్న ఘోరాలు అంతా ఇంత కాదు...

Viral News: ప్రియుడు మోసం చేశాడని మహిళ దారుణ నిర్ణయం.. కోపంలో చేశానంటూ సమర్థింపు..
Follow us on

Viral News: సమాజంలో రోజురోజుకీ నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. చిన్నచిన్న సమస్యలకే విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమ పేరుతో జరుగుతోన్న ఘోరాలు అంతా ఇంత కాదు. తనను ప్రేమించలేదని ఒకరు, ప్రేమించి మోసం చేశారని మరొకరు మనుషులను భౌతికంగా లేకుండా చేస్తున్నారు. అయితే తాజాగా తైవాన్‌లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. తనను ప్రేమించి మోసం చేశాడన్న కారణంతో ఓ మహిళ చేసిన పని ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది.

వివరాల్లోకి వెళితే.. హువాంగ్‌ కేకే అనే ఓ మహిళ తన ప్రియుడు మోసం చేశాడన్న కారణంతో కాహ్ సియుంగ్‌లో ఉన్న భారీ బిల్డింగ్‌కు నిప్పు అంటించింది. ఈ ఘటనలో ఏకంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 41 మంది గాయపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళను అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశించారు.

విచారణలో సమయంలో ఆమె చేసిన వాదనను విన్న న్యాయవాదులు ఆశ్చర్యపోయారు. ఉద్దేశ పూర్వకంగా చేయలేదని, ప్రియుడు మోసం చేశాడనే కోపంలో చేశానంటూ చెప్పి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే లాయర్లు ఆమెను ఉరి తీయాలని కోరారు. అయితే కోర్టు మాత్రం జీవిత ఖైదుతో సరిపెట్టుకుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..