దూసుకుపోతున్న ర్యాం’కింగ్స్’

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెటర్లు దూసుకుపోతున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. బుధవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో...

దూసుకుపోతున్న ర్యాం'కింగ్స్'
Follow us

|

Updated on: Aug 27, 2020 | 2:16 PM

ICC rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెటర్లు దూసుకుపోతున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. బుధవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో వీరిద్దరూ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. గత మార్చి నుంచి వన్డేలకి భారత క్రికెటర్లు దూరంగా ఉన్నా.. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాల్ని దక్కించుకున్నారు.

బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 871 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 829 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్ అజామ్, న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ , దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ పాయింట్లతో టాప్-5లో కొనసాగుతున్నారు.

ఇదిలావుంటే బౌలింగ్ విభాగంలోనూ భారత బౌలర్ .. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 719 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 722 పాయింట్లతో అగ్రస్థానాన్ని కంటిన్యూ చేస్తున్నాడు.

ఆ తర్వాత స్థానాల్లో ముజీబ్ ఉర్ రెహ్మాన్, పాట్ కమిన్స్, కగిసో రబాడ టాప్-5లో ఉన్నారు. ఇక ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ రవీంద్ర జడేజా 286 పాయింట్లతో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.

Latest Articles