PM Modi: ఎంపీలతో కలిసి కలిసి లంచ్ చేసిన ప్రధాని మోదీ.. వీడియో చూడండి

|

Feb 09, 2024 | 7:24 PM

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌లో శుక్రవారం అరుదైన దృశ్యం కనిపించింది. పార్టీలకతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ పార్లమెంట్‌ క్యాంటీన్‌లో లంచ్‌ చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. ఇంతే కాకుడా వారి బిల్లు కూడా ప్రధానే స్వయంగా చెల్లించినట్లు సమాచారం.

పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ పార్లమెంట్‌ క్యాంటీన్‌‌లో భోజనం చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. బీజేపీ సహా పలు పార్టీలకు చెందిన 8 మంది ఎంపీలను ప్రధాని నేడు లంచ్‌కు ఇన్వైట్ చేశారు. బీజేపీ ఎంపీలు హీనాగవిత్‌, ఎల్‌.మురుగన్‌, బీఎస్పీ ఎంపీ రితేశ్‌ పాండే.. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు తదితరులు ప్రధానితో కలిసి లంచ్ చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ లంచ్ మీటింగ్ కొనసాగింది. పలు కీలక అంశాల గురించి మోదీ నేతలతో చర్చించారు. తనతో పాటు ఆ ఎంపీల భోజనానికి అయిన ఖర్చును ప్రధానే చెల్లించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి 

Follow us on