పాస్టర్ పరలోక పయనం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. బతికుండగా గుళ్ళు కట్టించుకున్నోళ్లను చూశాం. కానీ బతికుండగా సమాధి తవ్వించుకున్న పాస్టర్ కథ పరలోకచింతనకు పరాకాష్టగా మారింది. అంతేకాదు జస్ట్ త్రీడేస్…చచ్చి మళ్ళీ పుడతానంటూ పుకార్లుపుట్టిస్తున్నాడు గొల్లపల్లికి చెందని ఓ పాస్టరు. చనిపోయి లేస్తానంటూ గొల్లపల్లిలో పాస్టర్ నాగభూషణంకి సీక్రెట్గా దేవుడు చెవిలో చెప్పిన వాక్యం మెదడును మొద్దుబార్చినట్టుంది. అందుకే తాను చనిపోయి మూడే మూడు రోజుల్లో తిరిగొస్తానంటూ సమాధిని తవ్వించుకొని పరలోక పయనానికి తయ్యారయ్యాడు సదరు ఫాదరు. పోవడమే తప్ప తిరిగి రావడం ఉండదని తెలియదా? తెలిసీ ఈ కట్టుకథలు అల్లుతున్నాడా? ఇదే పాస్టర్ స్టోరీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.