ఇప్పుడు ఆహారం కావాలంటే హోటళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లో యాప్ ఉంటే చాలు.. మీరు ఎక్కడుంటే అక్కడికి ఆహారం వచ్చేస్తోంది. దీంతో జొమాటో, స్విగ్గీ, ఉబెర్ ఈట్స్, ఫుడ్ పాండా వంటి ఫుడ్ డెలివరీ యాప్స్కు డిమాండు బాగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లోని హోటళ్లలో కస్టమర్ల కంటే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు.
తాజాగా ‘జొమాటో’ సంస్థ… ఓ హోటల్ వద్ద ఫుడ్ డెలివరీ బాయ్స్ క్యూలో నిల్చున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటో వైరల్గా మారింది. వీరంతా హైదరాబాద్లోని బావర్చి బిర్యానీ ఔట్లెట్ వద్ద ‘హైదరాబాదీ బిర్యానీ’ ఆర్డర్స్ తీసుకెళ్లేందుకు క్యూలో నిలుచున్నారని పేర్కొంది. అంటే, నగరంలో బిర్యానీకి ఎంత డిమాండు ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ హోటల్లో బిర్యానీ కోసం రోజుకు 2000 ఆర్డర్లు వస్తున్నాయని జొమాటో తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. ‘‘హైదరాబాద్లోని బావర్చి బిర్యానీ రెస్టారెంట్ వద్ద తీసిన ఫొటో ఇది.
Which restaurant from your city deserves this kind of a queue? ? pic.twitter.com/dua2Yge7C1
— zomato india (@zomatoin) April 10, 2019