ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో సమూల మార్పులకు కారణంగా మారింది. ప్రస్తుతం కృత్రిమ మేథ వినియోగం అనివార్యంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న అద్భుతాల్లో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు కూడా ఒకటి.
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చూడ్డానికి సాధారణంగా కనిపించే ఫొటోలను సరిగ్గా చూస్తే అద్భుతాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా చూసే వరకు ఆ అద్భుతం కనిపించదు. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో ఏంటి.? అందులో ఉన్న అంతటి ప్రత్యేకత ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
పైన ఫొటో చూడగానే మీకు ఏం కనిపిస్తోంది. ఏముందు పెద్ద పొలంలో పత్తి పంట, ఇద్దరు కూలివాళ్లు, రెండు వాహనాలు ఉన్నాయని అంటారా.? అయితే సరిగ్గా గమనిస్తే ఈ ఫొటోలో అసలు అద్భుతం కనిపిస్తుంది. ఇందులో శివపార్వతీలతో పాటు, నంది ఉంది కనిపించిందా.? ఎంత ట్రై చేసినా కనిపించకపోతే ఓసారి మీ కళ్లను సగం మూసి చూడండి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదండీ ఈ ఫొటోలో దాగున్న అసలు అద్భుతం. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. చూడ్డానికి మాములుగా కనిపిస్తున్న ఈ ఫొటోలో దాగి ఉన్న మరో ఫొటో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..