జమ్ముకశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో అమానుష చర్యకు పాల్పడ్డారు కొందరు దుండగులు. గ్రామస్తుల నుంచి తప్పించుకొని దగ్గర్లోని ఓ కొండను ఎక్కుతోన్న ఎలుగుబంటిపై వారు రాళ్లు విసిరారు. దీంతో పట్టుకోల్పోయిన ఆ భళ్లూకం నదిలో పడిపోయింది. ఆ తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ ఘటనకు పాల్పడిన వారిపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. ఓ మూగజీవిపై ఇలాంటి చర్యలు అమానుషం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు దీనిపై స్పందించిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ బషీర్ హుల్హక్ చౌదరీ.. ఎలుగు ఆచూకీ కోసం రాష్ట్ర అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
This is macabre, happened today at Drass. pic.twitter.com/rtnqzghLF3
— Mahmood Ah Shah (@mashah06) May 9, 2019