కేరళలోని త్రిస్సూర్లో 10వ తరగతి చదవుతున్న ఓ బాలిక గుర్రం ఎక్కింది. స్వారీ చేసుకుంటూ పరీక్షా కేంద్రానికి వెళ్లింది. స్కూలు బ్యాగు భుజానికి వేసుకుని స్వారీ చేసుకుంటూ వెళ్లడం అందరిని ఆశ్చర్య పరిచింది. గుర్రపు స్వారీ చేస్తూ వేగంగా వెళ్తున్న బాలికను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను వాట్సాప్ గ్రూప్లో చూసిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ఆనంద మహీంద్ర ట్విట్టర్ వేదికగా బాలికపై ప్రశంసలు వర్షం కురిపించారు. త్రిస్సూర్లో ఈ బాలిక ఎవరికైనా తెలుసా..? నా మొబైల్ స్క్రీన్ సేవర్గా ఆమె గుర్రం సవారీ చేసిన ఫొటోను పెట్టుకుంటానని, ఆమెను చూస్తే బాలికల విద్య మెరుగుపడుతుందన్న నమ్మకం కలిగిందని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.
Brilliant! Girls’ education is galloping ahead…A clip that deserves to go viral globally. This, too, is #IncredibleIndia https://t.co/y1A9wStf7X
— anand mahindra (@anandmahindra) April 7, 2019