అమ్మాయి గుర్రపు స్వారీపై కామెంట్ చేసిన ఆనంద్ మహేంద్ర..

| Edited By:

Apr 09, 2019 | 12:10 PM

కేరళలోని త్రిస్సూర్‌లో 10వ తరగతి చదవుతున్న ఓ బాలిక గుర్రం ఎక్కింది. స్వారీ చేసుకుంటూ పరీక్షా కేంద్రానికి వెళ్లింది. స్కూలు బ్యాగు భుజానికి వేసుకుని స్వారీ చేసుకుంటూ వెళ్లడం అందరిని ఆశ్చర్య పరిచింది. గుర్రపు స్వారీ చేస్తూ వేగంగా వెళ్తున్న బాలికను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో చూసిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో […]

అమ్మాయి గుర్రపు స్వారీపై కామెంట్ చేసిన ఆనంద్ మహేంద్ర..
Follow us on

కేరళలోని త్రిస్సూర్‌లో 10వ తరగతి చదవుతున్న ఓ బాలిక గుర్రం ఎక్కింది. స్వారీ చేసుకుంటూ పరీక్షా కేంద్రానికి వెళ్లింది. స్కూలు బ్యాగు భుజానికి వేసుకుని స్వారీ చేసుకుంటూ వెళ్లడం అందరిని ఆశ్చర్య పరిచింది. గుర్రపు స్వారీ చేస్తూ వేగంగా వెళ్తున్న బాలికను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో చూసిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ఆనంద మహీంద్ర ట్విట్టర్ వేదికగా బాలికపై ప్రశంసలు వర్షం కురిపించారు. త్రిస్సూర్‌లో ఈ బాలిక ఎవరికైనా తెలుసా..? నా మొబైల్ స్క్రీన్ సేవర్‌గా ఆమె గుర్రం సవారీ చేసిన ఫొటోను పెట్టుకుంటానని, ఆమెను చూస్తే బాలికల విద్య మెరుగుపడుతుందన్న నమ్మకం కలిగిందని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.