GHMC Elections: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టులో చుక్కెదురు.. ఆ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం..

|

Dec 05, 2020 | 12:37 PM

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. బ్యాలెట్ పేపర్లపై ఇతర ముద్రలు గల ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించిన అంశంలో...

GHMC Elections: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టులో చుక్కెదురు.. ఆ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం..
Follow us on

GHMC Elections: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. బ్యాలెట్ పేపర్లపై ఇతర ముద్రలు గల ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించిన అంశంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్వర్లుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ ముద్రతో పాటు ఎలాంటి ముద్ర ఉన్నా ఓటుగా పరిగణించవచ్చంటూ ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం కోట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎస్ఈసీ హైకోర్టును ఎస్ఈసీ ఆశ్రయించింది. ఆమేరకు ఆప్పీల్ దాఖలు చేసింది. ఎస్ఈసీ అప్పీలుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తితో కూడిన దర్మాసనం.. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. నేరేడ్‌మెట్‌లో ఫలితం నిలిచిపోయిందని ఎస్ఈసీ తెలుపగా.. సిబ్బందికి శిక్షణ లోపం కారణంగానే అలా జరిగిందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక.. అప్పుడు అభ్యంతరం ఉంటే అప్పీలు చేయాలని ఎస్ఈసీకి హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఇదే సమయంలో సోమవారం ఉదయం మొదట ఈ అంశంపైనే విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సింగిల్ జడ్జికి ఆదేశాలు జారీ చేసింది.