ప్రస్తుత కాలంలో గుండె పోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. ఉన్నచోటే గుండె పోటుతో కుప్ప కూలిపోతున్నారు. హార్ట్ ఎటాక్పై ఆరోగ్య నిపుణులు కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ హార్ట్ ఎటాక్కి గురవుతున్నారు. తాజాగా మరో వ్యక్తి కూడా ఎయిర్ పోర్టులో ఉన్నచోటే కుప్పకూలిపోయాడు . అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ జవాన్లు సీపీఆర్ చేసి కాపాడారు. హార్ట్ ఎటాక్కి గురైన ప్రయాణికుడు కార్డియో పల్మనరీ రిసస్కిటేషన్(సీపీఆర్) ప్రక్రియతో కాపాడి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
వివరాల్లోకి వెళ్తే.. అర్షిద్ అయూబ్ అనే వ్యక్తి మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో శ్రీనగర్ వెళ్లేందుకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. టెర్మినల్ 2 వద్ద లగేజీతో నిల్చనున్నాడు. అయితే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన అక్కడున్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది వెంటనే ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి పరిశీలించారు.
గుండె పోటు అని గమనించిన సిబ్బంది.. వెంటనే సీపీఆర్ చేయడం ప్రారంభించారు. అనంతరం మెరుగైన చికిత్స్ కోసం సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. గుండె పోటుకు గురైన వ్యక్తి శ్రీనగర్ వెళ్లేందుకు వచ్చాడని సీఐఎస్ఎఫ్ అధికార ప్రతిని తెలిపారు. హ్యాండ్ ట్రాలీ స్టాండ్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోవంతో.. అక్కడున్న ఇద్దరు జవాన్లు రక్షించినట్లు చెప్పారు. వెంటనే చర్యలు తీసుకోవడం వల్ల ఓ విలువైన ప్రాణాన్ని నిలబెట్టగలిగారని అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. సీఐఎస్ఎఫ్ జవాన్లపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
వీడియో చూడండి
Timely CPR administrated by CISF personnel saves life at T-2, Delhi Airport. pic.twitter.com/3T2dqOCSY1
— Amol Parth (@ParthAmol) August 22, 2024