Yadadri Lakshmi Narasimha Swamy Hundi: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి హుండీ లెక్కింపు బుధవారం యాదాద్రి కొండపై ఉన్న హరిత హోటల్లో చేపట్టారు. 16 రోజుల ఆదాయం రూ.64,92,590 వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. వీటితో పాటు మిశ్రమ బంగారం 48 గ్రాములు, వెండి కిలో 700 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, హుండీ లెక్కింపులో కోవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని జాగ్రత్తలు చేపట్టినట్లు ఆలయ ఈవో తెలిపారు.
కాగా, కరోనా నేపథ్యంలో ఆలయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈవో అన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పకుండా మాస్కులు ధరించాలని, అలాగే భౌతిక దూరం పాటించాలని కోరారు. దర్శన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని అన్నారు.