కులం వెలి.. మహిళ ఆత్మహత్యాయత్నం..!

| Edited By: Srinu

Jun 20, 2019 | 6:08 PM

ఆధునిక సమాజంలో ఉండి, కంప్యూటర్‌లతో పోటీ పడే కాలంలో సైతం కూడా మూఢాచారాలు కొనసాగుతున్నాయి. కొన్ని తండాల్లో ఇప్పటికీ గ్రామ బహిష్కరణ, సాంఘీక కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. ఇలాంటిదే ఓ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తగూడెంలో జరిగింది. ఓ కుటుంబాన్ని ఆ గ్రామ పెద్దలు 3 సంవత్సరాలు బహిష్కరించారు. దీంతో మనస్థాపానికి గురైన బాధిత కుటుంబానికి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ధనుంజయ, పద్మ దంపతుల కుమారుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ […]

కులం వెలి.. మహిళ ఆత్మహత్యాయత్నం..!
Follow us on

ఆధునిక సమాజంలో ఉండి, కంప్యూటర్‌లతో పోటీ పడే కాలంలో సైతం కూడా మూఢాచారాలు కొనసాగుతున్నాయి. కొన్ని తండాల్లో ఇప్పటికీ గ్రామ బహిష్కరణ, సాంఘీక కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. ఇలాంటిదే ఓ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తగూడెంలో జరిగింది. ఓ కుటుంబాన్ని ఆ గ్రామ పెద్దలు 3 సంవత్సరాలు బహిష్కరించారు. దీంతో మనస్థాపానికి గురైన బాధిత కుటుంబానికి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ధనుంజయ, పద్మ దంపతుల కుమారుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని రోజులకు మనస్పర్థల కారణంగా ఆ యువతి తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అనంతరం అతను మోసం చేసి లోబరుచుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. అతడిని జైలుకు పంపారు పోలీసులు.

అనంతరం గ్రామానికి వచ్చిన అతనికి గ్రామ పెద్ద మనుషులు.. పంచాయితీ నిర్వహించి 4 లక్షల రూపాయలు జరిమానా విధించారు. అయితే.. మేం జైలు శిక్ష కూడా అనుభవించాము.. ఇప్పుడు మళ్లీ డబ్బులెందుకు కట్టాలని అడిగినందుకు మూడు సంవత్సరాల పాటు గ్రామ బహిష్కరణ విధిస్తున్నట్టు తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన పద్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే బాధితురాలిని మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు.