Telangana: కొలిక్కి వస్తున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు.. త్వరలోనే వారి నియామకం?

|

Aug 15, 2024 | 7:08 AM

దీంతో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును అభ్యర్దించారు. కాని గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే, గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు...

Telangana: కొలిక్కి వస్తున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు.. త్వరలోనే వారి నియామకం?
Telangana
Follow us on

తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవుల లొల్లి కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేతో కొత్త ఎమ్మెల్సీల ఎన్నికకు మార్గం సుగమమైంది. గవర్నర్‌ కోటాపై పోరాడిన బీఆర్‌ఎస్‌ క్యాండేట్లకు చివరకు మొండిచేయే మిగిలింది. మరి కోదండరాం ఎమ్మెల్సీగా ఎప్పుడు ప్రమాణం చేయబోతున్నారు? గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

దీంతో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును అభ్యర్దించారు. కాని గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే, గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. గతేడాది దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం రికమెండ్‌ చేసింది. మంత్రివర్గం సమావేశంలో ఇద్దరి పేర్లను ఫైనల్‌ చేసి.. గవర్నర్‌కు పంపారు. కాని రాజకీయ నాయకులైన వీరిని ఎమ్మెల్సీగా నియమించడం కుదరదు అంటూ గవర్నర్ తమిళిసై ఆ సిఫారసును తోసిపుచ్చారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి పార్టీ అధినేత కోదండరాం, సియాసత్ ఉర్ధూ దినపత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్ ల పేర్లను కాంగ్రెస్ గవర్నర్ తమిళిసైకి సిఫారసు చేసింది. వీటిని ఆమె ఆమోదించింది. అయితే రాజకీయ నాయకులన్న కారణంతో తమ పేర్లను తిరస్కరించిన గవర్నర్ ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని ఎమ్మెల్సీగా ఎలా నియమిస్తారని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరి నియామకంలో గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటీషన్ ను విచారించిన హైకోర్టు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. దీంతో కోదండరాం, అమీర్ అలీఖాన్ లు ఎమ్మెల్సీలయ్యే అవకాశం అప్పట్లో కోల్పోయారు.

ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీ వ్యవహారం కోర్టుకెక్కడంతో 8 నెలలుగా పెండింగ్‌లో పడిపోయింది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పిటిషన్లను విచారించిన హైకోర్టు… కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సిఫార్సులను అమలు చేయకుండా హోల్డ్‌లో పెట్టేసింది. కొత్తగా మళ్లీ నియామకాలను చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. దీంతో ప్రొఫెసర్ కోదండరాం ఆశలపై నీళ్లు జల్లినట్లైంది. ఐతే ప్రభుత్వం తాజాగా కోదండరాం పేరును సిఫార్సు చేయడం, దీనిపై మళ్లీ కోర్టుకు వెళతానని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. గవర్నర్ తమిళిసై మారడం.. ఇన్‌చార్జ్ గవర్నర్ కొంత కాలం ఉండటంతో ఎమ్మెల్సీ ఖాళీ స్థానాల భర్తీ అంశం ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చింది.

ప్రస్తుతం కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు స్వీకరించడంతో మళ్లీ ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ తెరపైకి వచ్చింది. లాస్ట్ క్యాబినేట్ సమావేశంలో ఖాళీ ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ కోదండరాం, అమీర్ అలీఖాన్‌ పేర్లను క్యాబినెట్ లో తీర్మానించారు. ప్రస్తుతం ఈ అంశం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా మార్గం సుగమం అవడంతో.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం, అమీర్ అలీఖాన్ ల నియామకం లాంఛనం కానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..