Telangana: నీళ్లపై చర్చలో మాటల మంటలు.. మాటలయుద్ధంతో దద్దరిల్లిన అసెంబ్లీ

| Edited By: Rajeev Rayala

Feb 12, 2024 | 3:43 PM

ఇంత కీలకమైన సమావేశాలకు మాజీ CM, విపక్ష నేత KCR హాజరుకాకపోవడాన్ని CM రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. ఉత్తమ్ ప్రజెంటేషన్‌తో మొదలుపెట్టి హరీష్‌ ప్రసంగం వరకూ మధ్యలో.. పలువురు మంత్రులు BRSకి గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నం, శ్రీధర్‌బాబు అందరూ.. విపక్షం విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

 Telangana: నీళ్లపై చర్చలో మాటల మంటలు.. మాటలయుద్ధంతో దద్దరిల్లిన అసెంబ్లీ
Telangana Assembly
Follow us on

తెలంగాణ, ఫిబ్రవరి 12: నీళ్లపై చర్చలో నిప్పులు కురిసాయి. KRMBకి ప్రాజెక్టుల అప్పగింత విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధంతో అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. అధికారపక్షం ప్రస్తావించిన ప్రతి అంశానికి.. BRS నుంచి కౌంటర్‌ అదే స్థాయిలో వచ్చింది. ఓ దశలో వ్యక్తిగత విమర్శలతో చర్చ పక్కదారిపట్టింది. కృష్ణానదీ జలాల విషయంలో ముమ్మాటికీ తెలంగాణకు అన్యాయం చేసింది గత BRS ప్రభుత్వమేని ఉత్తమ్‌ ఒకటికి రెండుసార్లు రెట్టించారు. కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడానికి తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీనికి మాజీ మంత్రి హరీష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఏపీ, తెలంగాణకు 50:50 నిష్పత్తిలో నీరువ్వాలని కోరిందే తామని.. ప్రాజెక్టుల అప్పగింతకు తమ హయాంలో అంగీకరించలేదని వివరించారు. అటు, ఇంత కీలకమైన సమావేశాలకు మాజీ CM, విపక్ష నేత KCR హాజరుకాకపోవడాన్ని CM రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. ఉత్తమ్ ప్రజెంటేషన్‌తో మొదలుపెట్టి హరీష్‌ ప్రసంగం వరకూ మధ్యలో.. పలువురు మంత్రులు BRSకి గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నం, శ్రీధర్‌బాబు అందరూ.. విపక్షం విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. చర్చ మధ్యలో AP సీఎం జగన్ పేరు కూడా పదేపదే ప్రస్తావనకు వచ్చింది.

కృష్ణా నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడానికి తాము వ్యతిరేకమన్నారు. గతంలో కేసీఆర్, జగన్ చర్చల జరిపిన తరువాత తెలంగాణకు మరింత నష్టం జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణా జలాలను 50శాతం అదనంగా ఏపీ తరలించుకుపోతోందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి