దరిద్రాన్ని దూరం చేస్తామంటూ క్షుద్రపూజలు..!

|

Apr 20, 2019 | 7:05 PM

నిజామాబాద్‌: నిజామాబాద్ జిల్లాలోని గన్నారం గ్రామంలో క్షుద్రపూజలు చేస్తున్నారంటూ ఇద్దరు మహిళలపై స్థానికులు దాడి చేశారు. జాక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన దేశమ్మ, గంగమ్మ అనే ఇద్దరు మహిళలు గన్నారం గ్రామానికి చీరలు అమ్మడానికి వెళ్లారు. ఇక అక్కడ ఓ ఇంట్లోకి వెళ్లి మహిళతో మాటలు కలిపి.. స్పెషల్ పూజలు చేసి మీ దరిద్రాన్ని దూరం చేస్తామంటూ నమ్మించారు. అయితే ఆ సదరు మహిళకు వారి ప్రవర్తన మీద అనుమానం కలిగి స్థానికులకు విషయాన్ని చేరవేసింది. […]

దరిద్రాన్ని దూరం చేస్తామంటూ క్షుద్రపూజలు..!
Follow us on

నిజామాబాద్‌: నిజామాబాద్ జిల్లాలోని గన్నారం గ్రామంలో క్షుద్రపూజలు చేస్తున్నారంటూ ఇద్దరు మహిళలపై స్థానికులు దాడి చేశారు. జాక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన దేశమ్మ, గంగమ్మ అనే ఇద్దరు మహిళలు గన్నారం గ్రామానికి చీరలు అమ్మడానికి వెళ్లారు. ఇక అక్కడ ఓ ఇంట్లోకి వెళ్లి మహిళతో మాటలు కలిపి.. స్పెషల్ పూజలు చేసి మీ దరిద్రాన్ని దూరం చేస్తామంటూ నమ్మించారు. అయితే ఆ సదరు మహిళకు వారి ప్రవర్తన మీద అనుమానం కలిగి స్థానికులకు విషయాన్ని చేరవేసింది. స్థానికులందరూ కలిసి ఇద్దరు మహిళల్ని చితకబాది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.