Special Buses: పర్యాటకులను ఆకర్షించేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. షిరిడీ, తిరుపతికి ప్రత్యేక బస్సులు

|

Jan 30, 2021 | 5:49 AM

Special Buses: పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు టీఎస్‌టీడీసీ షిరిడీ, తిరుపతి ప్రత్యేక వోల్వో బస్సు సర్వీసులు, హైదరాబాద్‌ నగరంలో రెండు ఎలక్ట్రికల్‌ బస్సులను..

Special Buses: పర్యాటకులను ఆకర్షించేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. షిరిడీ, తిరుపతికి ప్రత్యేక బస్సులు
Follow us on

Special Buses: పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు టీఎస్‌టీడీసీ షిరిడీ, తిరుపతి ప్రత్యేక వోల్వో  బస్సు సర్వీసులు, హైదరాబాద్‌ నగరంలో రెండు ఎలక్ట్రికల్‌ బస్సులను నెలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం రైళ్లు ఇప్పటి వరకూ పూర్తిగా రాకపోకలు లేకపోవడంతో చాలా మంది దూర ప్రయాణాలను వేయిదా వేసుకుంటున్నారు.
ఈ పరిస్థితుల్లో షిరిడీ, తిరుపతి ప్యాకేజీలు సందర్శకులను ఆకట్టుకుంటాయని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రికల్‌ బస్సులకు ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయని, పూర్తి పర్యావరణహితంగా ఉండాలనే ఉద్దేశంతో వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో ఆ మూడు ఇబ్బందులు: రాహుల్‌ గాంధీ