మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో హాస్టల్ విద్యార్థుల భేటీ.. ఆ విషయంలో ఆందోళన అవసరం లేదని మంత్రి భరోసా

|

Jan 27, 2021 | 3:00 PM

తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కాచిగూడలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులు కలుసుకున్నారు. డిగ్రీ, పీజీ, లా పరీక్షలు ఉన్నందున..

మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో హాస్టల్ విద్యార్థుల భేటీ.. ఆ విషయంలో ఆందోళన అవసరం లేదని మంత్రి భరోసా
Follow us on

తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కాచిగూడలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులు కలుసుకున్నారు. డిగ్రీ, పీజీ, లా పరీక్షలు ఉన్నందున హాస్టల్‌ భవనానికి మరమ్మతులను వాయిదా వేయాలని, భోజన వసతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో హాస్టల్‌ విద్యార్థులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అభయమిచ్చారు. ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. భవనానికి అవసరమైన మరమ్మతులు పరీక్షల అనంతరమే చేపడుతామని భరోసానిచ్చారు.

చాలా ఏండ్ల కిందట నిర్మించిన వసతి గృహానికి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఇటీవల అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యార్థులు మంత్రిని కలిసి పరీక్షల అనంతరం మరమ్మతులు చేపట్టాలని విన్నవించారు. విద్యార్థలు సమస్యను అర్థం చేసుకున్న మంత్రి.. వివిధ కోర్సుల పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు పూర్తయ్యాక మరమ్మతులు చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు మంత్రి కొప్పుల ఆదేశించారు.