గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో పిజ్జా ఔట్ లెట్ను మంత్రి ప్రారంభించారు. మహిళా పారిశ్రామికవేత్త గౌతమి ఏర్పాటు చేసిన పిజ్జా ఔట్ లెట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువ పారిశ్రామికవేత్తలకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతి గిరిజన బిడ్డ ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.