మహబూబాబాద్ : జిల్లాలోని డోర్నకల్ రైల్వే జంక్షన్లో ప్రమాదం తప్పింది. ఒకటో నెంబర్ ప్లాట్ పాం వద్ద రైలు పట్టా విరిగింది. గూడ్స్ రైలు వెళ్తుండగా రైలు పట్టా విరిగింది. అయితే.. రైలు వెళ్తుండగా రైలు పట్టా విరగడాన్ని గుర్తించిన కీమాన్.. వెంటనే గూడ్స్ రైలు డ్రైవర్కు సమాచారం అందించాడు. దీంతో డ్రైవర్ వెంటనే గూడ్స్ను ఆపేశాడు. కీమాన్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.