Crime News: టీవీ సౌండ్ ఎఫెక్ట్.. ఓనర్ ప్రాణం హాంఫట్..

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 6:04 PM

టీవీ సౌండ్ వివాదం.. ఏకంగా ఓనర్ ప్రాణాలు పోయేలా చేసింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగింది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఏకంగా ఓనర్‌పై దాడి చేసి హత్య..

Crime News: టీవీ సౌండ్ ఎఫెక్ట్.. ఓనర్ ప్రాణం హాంఫట్..
Follow us on

Crime News: టీవీ సౌండ్ వివాదం.. ఏకంగా ఓనర్ ప్రాణాలు పోయేలా చేసింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగింది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఏకంగా ఓనర్‌పై దాడి చేసి హత్య చేశాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. బాలనర్సయ్య దంపతులు కొత్తగా.. ఆర్మూర్‌లోని గోల్‌‌బంక్ ప్రాంతంలో ఉన్న రాజేందర్ దంపతుల ఇంట్లో అద్దెకు దిగారు. మొదట్లో బాలనర్సయ్య దంపతులు అన్యోన్యంగా ఉన్నా.. గత కొద్దిరోజుల నుంచి గొడవలు జరగడం మొదలయ్యాయి. అవి మరీ ఎక్కువ కావడంతో.. ఇంటి పక్కనే ఉన్న యజమాని రాజేందర్ తీరు మార్చుకోవాలని సూచించారు. అయినా తీరు మారలేదు. షరా మామూలుగానే శుక్రవారం రాత్రి కూడా గొడవపడ్డారు. దీంతో.. విసుగుపోయినా రాజేందర్.. టీవీ సౌండ్ పెంచారు. అలా టీవీలో లీనమైయ్యింది రాజేందర్ ఫ్యామిలీ.

ఈ లోపు బాలనర్సయ్య.. వచ్చి టీవీ సౌండ్ ఎందుకు పెంచారు? అని గొడవ దిగాడు. అలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇంకేముంది కోపంతో ఊగిపోతూ.. బాల నర్సయ్య కర్రతో.. రాజేందర్ తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో రాజేందర్ ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయాడు. తలకి బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇదంతా చూసి భయమేసిన బాల నర్సయ్య వెంటనే ఇంటినుంచి పరారయ్యాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాల నర్సయ్య కోసం గాలిస్తున్నారు.