Telangana: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. ఇటీవలే తిరుపతి వెళ్లొచ్చిన మదన్‌రెడ్డి…

| Edited By: Pardhasaradhi Peri

Dec 30, 2020 | 7:20 AM

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన తిరుమలకు వెళ్లివచ్చారు. ఈ క్రమంలో ఆయనకు జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Telangana: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. ఇటీవలే తిరుపతి వెళ్లొచ్చిన మదన్‌రెడ్డి...
Follow us on

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన తిరుమలకు వెళ్లివచ్చారు. ఈ క్రమంలో ఆయనకు జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వాటిల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తేలిందని మదన్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలికాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు, తనతో కాంటాక్టులో ఉన్నవారు విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ నిర్ధారణ అయితే చికిత్స చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.