Telangana MLA : పశ్చిమ బెంగాల్ రాజకీయాలను తెలంగాణలో తెచ్చేందుకు బీజేపీ కుట్ర.. ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..

| Edited By: Shaik Madar Saheb

Nov 16, 2021 | 7:20 PM

Bjp vs Trs: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ‘‘బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాదు..

Telangana MLA : పశ్చిమ బెంగాల్ రాజకీయాలను తెలంగాణలో తెచ్చేందుకు బీజేపీ కుట్ర.. ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..
Jeevan Reddy
Follow us on

Bjp vs Trs: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ‘‘బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాదు.. బురద సంజయ్, గుండా సంజయ్.’’ అని తీవ్ర కామెంట్స్ చేశారు. పశ్చిమ బెంగాల్ వాతావరణాన్ని తెలంగాణలో తెచ్చేందుకు బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని నిప్పుల చెరిగారు. బండి సంజయ్ తన వాహనంలో కర్రలు పెట్టుకుని తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ వాళ్లే టీఆరెస్ పై దాడి చేసి.. దొంగే దొంగ అన్నట్లు టీఆరెస్ వాళ్ళు దాడి చేశారని ఆరోపిస్తున్నారని ధ్వజమెత్తారు. యాసంగి ధాన్యం కొనకపోతే బట్టలు విప్పి ఉరికించి కొడతారని వ్యాఖ్యానించారు. దేశంలో 36 పార్టీల మెడలు వంచి ఒప్పించి తెలంగాణ తెచ్చిన చరిత్ర కేసీఆర్‌ది అని అన్నారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడతాం అంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.

రైతులతో పెట్టుకున్న కాంగ్రేస్- టీడీపీ ల పరిస్థితి ఏమైందో బీజేపీ తెలుసుకోవాలని హితవు చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో చేసినట్లు గుండాయిజం చేస్తామంటే కుదరదని, ఇది తెలంగాణ అనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. గుండా రాజకీయం చేస్తే బట్టలువిప్పి రైతులు ఉరికిచ్చి కొడతారని బీజేపీ నేతలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దిమాక్ లేని ఎంపీ బండి సంజయ్.. ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ధాన్యం ఎందుకు కొనడం లేదని ధర్నాలు ప్రధాని మోడీ ముందు, కేంద్ర వ్యవసాయ మంత్రి ముందు చేస్తే బాగుంటుందని అన్నారు. బందిపోటు దొంగల్లాగా వ్యవహరిస్తే చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు. బురదజల్లే పార్టీగా బీజేపీ మారిందని, తగిన మూల్యం చెల్లించుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉండాలని అన్నారు. రైతులతో రాళ్ల వర్షం కురిపించుకుంటారో.. పూల వర్షం కురిపించుకుంటారో బీజేపీ నేతలే తేల్చుకోవాలని అన్నారు.

Also read:

Challan Pending: మామూలోడు కాదు.. చలానాల చిట్టా చూసి అవాక్కైన ట్రాఫిక్‌ పోలీసులు..!

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ స్టేషన్‌లో దేశంలోనే తొలి పాడ్‌ హోటల్‌.. రేపు ప్రారంభం!

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ బంధువులు సహా ఆరుగురు మృతి..