రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు

| Edited By:

Jun 13, 2020 | 8:07 AM

నైరుతి రుతుపవనాలు క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో తొలకరి వానలు మొదలయ్యాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, అన్ని జిల్లాలకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు
Follow us on

నైరుతి రుతుపవనాలు క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో తొలకరి వానలు మొదలయ్యాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, అన్ని జిల్లాలకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతికితోడు ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉంది. ఈ రెండింటి ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడిచింది. ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రంభీంఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువొచ్చని చెప్పారు. రాగల ఐదురోజులు గ్రేటర్ హైదరాబాద్ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.