తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

|

Jun 02, 2020 | 9:43 AM

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో పని చేసిన రాష్ట్రపతులకు భిన్నంగా.. అచ్చ తెలుగులో ట్విట్‌ చేశారు కోవింద్‌. తెలుగులో అచ్చు పొల్లు పోకుండా అచ్చ తెలుగులో ఈ ట్విట్‌ చేయడం విశేషం.

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
Follow us on

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో పని చేసిన రాష్ట్రపతులకు భిన్నంగా.. అచ్చ తెలుగులో ట్విట్‌ చేశారు కోవింద్‌. తెలుగులో అచ్చు పొల్లు పోకుండా అచ్చ తెలుగులో ఈ ట్విట్‌ చేయడం విశేషం.

తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్‌ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. యావత్‌ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతమన్నారు. కష్టపడి పని చేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్‌ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.

“తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం!, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం.” అంటూ ట్వీట్ చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్.