ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరంద్ర మోదీ అయోధ్య పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నట్లు శ్రీ రామ మందిర నిర్మాణ తీర్ధ క్షేత్ర ట్రస్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లేనన్నారు. లౌకికవాదం రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో భాగమన్నారు. ఓవైసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ” ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించడమే. లౌకికవాదం రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో ఓ భాగం” అంటూ పోస్ట చేశారు.
Attending Bhumi Pujan in official capacity will be a violation of @PMOIndia‘s constitutional oath. Secularism is part of the Basic Structure of Constitution
We can’t forget that for over 400 years Babri stood in Ayodhya & it was demolished by a criminal mob in 1992 https://t.co/qt2RCvJOK1
— Asaduddin Owaisi (@asadowaisi) July 28, 2020