నిజమాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణ ప్రాంతంలో దొంగలు కలకలం రేపారు. రాత్రి స్థానికంగా ఉన్న పెట్రోల్ బాంక్ లోకి కత్తులతో చొరబడ్డారు. రాళ్లతో సిబ్బందిపై దాడి చేసి క్యాష్ కౌంటర్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో పెట్రోల్ బంకులోని పనిచేసే వర్కర్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రధాన రహదారి పై గల ఈ పెట్రోల్ బాంక్ లో జరిగిన చోరీ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.