ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పరిషత్ పోలింగ్

| Edited By: Ram Naramaneni

May 06, 2019 | 7:34 PM

తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా కొనసాగింది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. తొలివిడతలో భాగంగా 2,096 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 10న రెండో విడత, 14న […]

ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పరిషత్ పోలింగ్
Follow us on

తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా కొనసాగింది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. తొలివిడతలో భాగంగా 2,096 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 10న రెండో విడత, 14న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 27వ తేదీన వెలువడనున్నాయి.