యు.. వీ.. కెన్.. క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్ సహాయంతో నిజామాబాద్ జిల్లా పెద్దాస్పత్రి దశ దిశ మొత్తం మారిపోయింది. పేదోడి పెద్దాస్పత్రి ఇప్పుడు కార్పొరేట్ హంగులు అద్దుకుంది. నిరుపేదకు ఆధునిక వైద్యం అందించేందుకు రెడీ అయింది. కోట్ల రూపాయల విలువ చేసే అత్యాధునిక ఎక్విప్మెంట్ హాస్పిటల్కు చేరాయి. బుధవారం ICU బెడ్స్ ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
మిషన్ తౌజండ్ బెడ్స్ పేరుతో సర్కారు దవాఖానాల్లో కార్పొరేట్ స్టయిల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకొచ్చారు యువరాజ్ సింగ్. ఇందులోభాగంగా నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిని సెలెక్ట్ చేసుకున్నారు. రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే 120 ఐసీయూ బెడ్స్ అందించారు. ఇంత పెద్ద మొత్తంలో క్రిటికల్ బెడ్స్ ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది మొదటిసారి.
యువరాజ్ సింగ్ పెద్ద మనసు చాటుకోవడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్లో దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసేలా బ్యాట్ ఝుళిపించిన యువీ.. పేదోడి వైద్యం అందించాలన్న ఆలోచన చాలా గొప్పదంటున్నారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల విషయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. యూవీకెన్ ఫౌండేషన్ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు.
ఏకంగా 120 ఐసీయూ బెడ్స్ సమకూరడంపై డాక్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థర్డ్ వేవ్తో పాటు ఎలాంటి వైద్య విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు సూపరింటెండెంట్ ప్రతిమారాజ్.
అధునాతన సౌకర్యాల విషయంలో యూవీకెన్ ఫౌండేషన్ సభ్యులు ఎక్కడా తగ్గలేదు. పై పాప్, సిపాప్ లాంటి వెంటిలేటర్లతో పాటు ఈసీజీ, డ్రగ్ స్టోరేజీ రిఫ్రిజిరేటర్లాంటి సదుపాయను ఐసీయూలో అందుబాటులో ఉంచారు. కొవిడ్ సమయంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది చేసిన సేవలకు దేశస్థాయిలో గుర్తింపు వచ్చింది.
ఈ సేవలే యువరాజ్ సింగ్ దృష్టిని ఆకర్షించేలా చేశాయి. యూవీకెన్ పౌండేషన్ ప్రతినిధుల చొరవతో బుధవారం నుంచి 120 ఐసీయూ బెడ్స్ వైద్యానికి ఆందుబాటులోకి రానున్నాయి.
A proud partnership and a monumental milestone! Join us tomorrow for the e-inauguration of the newly set up 120-bed COVID care facility in Nizamabad, Telangana. #Mission1000Bed #CovidRelief #CovidIndia #IndiaFightsCovid
@YUVSTRONG12 @ravipv @OneDigitalEnt pic.twitter.com/uL8pMdd9nk
— YouWeCan (@YOUWECAN) July 27, 2021