హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ ట్రైన్ పట్టాలు తప్పింది. లింగంపల్లి నుంచి హఫీజ్ పేట మధ్య వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడింది. ఓ వైపు ఎండ.. మరోవైపు వర్షంతో నగరం సాయంత్రం తడిసిముద్దైంది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సైదాబాద్, మలక్పేట్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఈ రోజు ఉదయం వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ఎండ కాస్త పెరింది. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో అక్కడ అక్కడ చిరుజల్లులు పడ్డాయి.