Telangana Minister: పిచ్చిగా మాట్లాడొద్దు, ప్రజలను రెచ్చగొట్టొద్దు.. బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్..

|

Jan 13, 2021 | 5:59 PM

Telangana Minister: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. పిచ్చిగా మాట్లాడొద్దని..

Telangana Minister: పిచ్చిగా మాట్లాడొద్దు, ప్రజలను రెచ్చగొట్టొద్దు.. బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్..
Follow us on

Telangana Minister: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. పిచ్చిగా మాట్లాడొద్దని, ప్రజలను రెచ్చగొట్టొద్దని అన్నారు. బుధవారం నాడు జనగామలో ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భాగ్యలక్ష్మి, భద్రకాళి దేవాలయాలు కాదు.. అభివృద్ధి విషయంలో తేల్చుకుందాం అని అన్నారు. దయచేసి పిచ్చి పిచ్చిగా నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని, ఈ విషయంలో సంజయ్‌కు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదన్నారు.

జనగామ జిల్లాలో మంగళవారం నాడు బీజేపీ నేతలపై అక్కడి పోలీసులు లాఠీ చార్జి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా పరిగణించారు. 24 గంటల్లో సదరు పోలీసుల అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేదంటే జనగామలో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బుధవారం నాడు బండి సంజయ్ జనగామకు వెళ్లారు. భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఆ సందర్భంగా డీసీసీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించాయి. దాంతో అలర్ట్ అయిన పోలీసులు బీజేపీ నేతలను నిలువరించారు. మరోవైపు బండి సంజయ్ కూడా వారిని శాంతింపజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Also read:

Akhila Priya: ముగిసిన అఖిల ప్రియ కస్టడీ.. కీలక విషయాలు రాబట్టిన పోలీసులు.. ఆమె ఫోన్ చేసి ఆ విషయం చెప్పడంతోనే..

Strain Virus: కలవరపెడుతున్న కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్‌.. భారత్‌లో 102కు చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య