హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సి.కనకారెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే పరిస్థితి విషమించి ఇవాళ తుదిశ్వాస విడిచారు. కనకారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శాసనసభ సభ్యుడిగా ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు. కనకారెడ్డి 2014-18 మధ్య మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగారు.