హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీఎన్ రెడ్డినగర్ నుండి గుర్రంగూడ గేటు వైపు వెళ్తున్న బైక్ను వెనుక నుండి వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. కార్లు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
మృతి చెందిన యువకులు వంశీ, సాయి, గణేష్గా గుర్తించారు. వంశీ, సాయి గుర్రంగూడెంకు చెందిన వారు కాగా.. గణేష్ వనస్థలిపురంకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వంశీ, సాయి విద్యార్థులని, గణేష్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.