కోడలిగా స్వీకరించండి.. అత్త ఇంటిముందు బాధితురాలి ఆవేదన..

| Edited By: Srikar T

Jul 16, 2024 | 5:46 PM

ప్రేమిస్తానని వెంటపడ్డాడు.. నీవు లేక నేను ఉండలేనని నమ్మించాడు. శారీరకంగా ఒక్కటయ్యారు. ఇప్పుడు మోజు తీరిన తరువాత వద్దంటున్నాడు. దీంతో ప్రేమించిన పాపానికి ఆ ప్రియురాలు ఆందోళన చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ప్రియుని ఇంటిముందు ప్రియురాలు ధర్నాకు దిగింది.

కోడలిగా స్వీకరించండి.. అత్త ఇంటిముందు బాధితురాలి ఆవేదన..
Love Marriage
Follow us on

ప్రేమిస్తానని వెంటపడ్డాడు.. నీవు లేక నేను ఉండలేనని నమ్మించాడు. శారీరకంగా ఒక్కటయ్యారు. ఇప్పుడు మోజు తీరిన తరువాత వద్దంటున్నాడు. దీంతో ప్రేమించిన పాపానికి ఆ ప్రియురాలు ఆందోళన చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ప్రియుని ఇంటిముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. సుల్తానాబాద్‎కు చెందిన మానస, కొనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన అక్షయ్ గత 7 సంవత్సరం నుండి ప్రేమించుకున్నారు. ఆరు నెలల ముందు ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. హైదరాబాదులో కాపురం పెట్టారు. అమ్మాయి ఉద్యోగం చేస్తుంది.. ఆమే తన భర్తను పోషిస్తుంది. కొన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నారు. తరువాత హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు భర్త. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు.

అప్పటికే.. ఈమె గర్భం దాల్చింది. హైదరాబాద్ నుంచి మానస సుద్దలకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు పరారయ్యాడు. దీంతో ఇంటి ముందు మానస బైఠాయించింది. ప్రియుడు తల్లి మమత, వారి కుటుంబ సభ్యులు అమ్మాయిని చితకబాదారు. ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలోనే సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. అయితే అక్షయ్ తరుఫున పెద్ద మనుషులు డబ్బు రాయబారం జరిపారు. వారు చెప్పే మాటలు భరించలేక భర్త ఇంటిముందు బైటాయించినట్లు ఆవేదన వ్యక్తం చేస్తుంది బాధితురాలు. తనను పెళ్లి చేసుకున్న అక్షయ్ తనకు కావాలని, అక్షయ వల్లనే ప్రెగ్నెన్సీ దాల్చానని, తనను వారి కోడలుగా స్వీకరించాలని వేడుకుంటోంది. ఇంత జరుగుతున్నా అబ్బాయి అక్షయ్ పట్టించుకోకుండా పరారిలో ఉన్నాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని అమ్మాయిని, అబ్బాయి బంధువులను పోలీస్ స్టేషన్ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..